‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా అలరించిన తేజ సజ్జా హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం’మిరాయ్’. ఈ చిత్ర టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు’ అనే సాధువు వాయిస్తో టీజర్ మొదలౌతుంది. ది బ్లాక్ స్వోర్డ్ (మనోజ్ మంచు)గా ఎంట్రీ ఇస్తాడు. తిరుగులేని శక్తి కలిగి వినాశన మార్గాన్ని మొదలు పెడతాడు. కానీ ఈసారి జోక్యం చేసుకునేది దేవతలు కాదు, వారి ఆయుధం ‘మిరారు’. 9 బుక్స్.. 100 క్వశ్చన్స్.. 1 స్టిక్.. బిగ్ అడ్వెంచర్’ అంటూ సూపర్ యోధగా తేజ సజ్జా ఎంట్రీ అదిరిపోయింది. అతను తన విధి గురించి నిజాన్ని తెలుసుకుంటాడు, తనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తాడు. ఈ చిత్రం ఇప్పటివరకు భారతీయ తెరలపై రాని ఒక ప్రత్యేకమైన, చాలా తాజా కథాంశాన్ని ప్రజెంట్ చేస్తోందని టీజర్ చెప్పకనే చెప్పింది.
ఇప్పటికే టీజర్తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 భాషలలో 2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదల కానుంది.
‘మిరాయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -