- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండలంలోని మిర్దపల్లి గ్రామానికి చెందిన కర్నాల రాము ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 2024 గ్రూపు 4 ఫలితాలలో అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్( డి.ఎస్.పి) గా ఎంపిక కావడం జరిగిందని స్థానికులు ఆదివారం తెలిపారు. తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తో ఈ సందర్భంగా చిన్న వయసులో ఉద్యోగం సాధించడం అభినందనీయమని ఎస్బిఐ మేనేజర్ శ్రీనివాస్, లెక్చరర్ నిమ్మల నరేష్ , ఉపాధ్యాయులు లావణ్య ,నవనీత, రేషన్ డీలర్ సింగిరెడ్డి సాయన్న, మాజీ సర్పంచ్ మోహన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -