- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్ : జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ 145 ఎం ఎల్ డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రధాన పి సి సి పి పైప్ లైన్ మరమ్మత్తుల నిర్వహణ కారణంగా మోటార్స్ నిలిపివేయడం జరుగుతుంది అని బాన్సువాడ డివిజన్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున బాన్సువాడ, జుక్కల్, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు బల్క్ నీటి సరఫరాలో రెండు రోజులు (19-06-2025 20-06-2025) అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు. కావున గ్రామాల్లోని ప్రజలు గ్రామపంచాయతీ బోర్ వాటర్ ను వాడుకోవాలని ఆయన సూచించారు.
- Advertisement -