- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీలో జున్నార్ ఎమ్మెల్యే శరద్ సోనావణే వినూత్న నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలో చిరుత దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ.. ఆయన చిరుత పులి వేషంలో సభ ఆవరణకు వచ్చారు. గత మూడు నెలల్లో జున్నార్ ప్రాంతంలో 55 మంది మరణించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ తీవ్రమైన సమస్యపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకే ఇలా వచ్చానని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



