నవతెలంగాణ – అశ్వారావుపేట
నకిలీ విత్తనాలు, ఎరువులు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. అశ్వారావుపేట ప్రాథమిక సహకార పరిమితి సంఘం ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం సబ్సిడీతో జనుము జీలుగు విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు భూసారం పెంచి వారి పెట్టుబడి ఖర్చులు తగ్గి లాభదాయకమైన వ్యవసాయానికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రంగాల్లో తోడ్పాటును అందిస్తోందని నాయకులు అధికారులు కూడా రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, త్వరలోనే విశాల సహకార పరిమితి సంఘం ఆధ్వర్యంలో నాణ్యమైన వరి విత్తనాలు పంపిణీ చేస్తుందన్నారు. అవసరమున్న అర్హులైన రైతులు సమీప సహకార సంఘాన్ని సంప్రదించాలని కోరారు.నకిలీ విత్తనాలతో మోసపోకుండా జాగ్రత్త వహించాలన్నారు.అధికారులు కూడా నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో గల పేరాయిగూడెం సందర్శించి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అదనపు భవనాలు నిర్మాణ పనులను పరిశీలించారు.
క్యాంపు కార్యాలయంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అదే గ్రామం లో ఇటీవల వివాహం జరిగిన నార్లపాటి బాబు కుమారుడు నవీన్ – సౌజన్య నూతన దంపతులను ఆశీర్వదించారు.నార్లపాటి రాంబాబు గారి కుమార్తెల ఓణీ ల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,వ్యవసాయ శాఖ మండల అధికారి శివరాం ప్రసాద్, కాంగ్రెస్ మండల అద్యక్షుడు తుమ్మ రాంబాబు, నాయకులు జూపల్లి రమేష్,సుంకవల్లి వీరభద్రరావు, ప్రమోద్,మిండ హరిక్రిష్ణ,కానూరి మోహాన్ రావు,రైతు లు తలసిల ప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.