Sunday, February 8, 2026
E-PAPER
Homeఖమ్మంఅగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జారె

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జారె

- Advertisement -

– ఇందిరమ్మ గృహాం మంజూరు చేస్తామని హామీ 
– తక్షణ సహాయం గా రూ.10 వేలు అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మండలంలోని నారంవారిగూడెం కాలని లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరామర్శించారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అయిన రేకుల షెడ్డు యజమానులు యలమర్తి రమాదేవి – కోటేశ్వరరావు లను ఓదార్చి రేకుల షెడ్డు అగ్ని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10 వేలు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ త్వరలోనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఆయన వెంట పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -