Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి తీవ్ర గాయాలు..ఆస్ప‌త్రికి తరలింపు

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి తీవ్ర గాయాలు..ఆస్ప‌త్రికి తరలింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి హరీశ్‌ రావుతో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి రాత్రంతా అక్కడే ఉండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోగా.. కుడి కాలు విరిగినట్లుగా సమాచారం. దీంతో అప్రమత్తమైన ఫామ్‌హౌస్ సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన సోమాజిగూడలోని యశోదా ఆస్ప‌త్రికి తరలించారు. ఈ మేరకు వైద్యులు ఆయనకు సర్జరీ చేయనున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad