- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్కు వెళ్లారు. అయితే, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి రాత్రంతా అక్కడే ఉండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బాత్రూమ్లో కాలుజారి పడిపోగా.. కుడి కాలు విరిగినట్లుగా సమాచారం. దీంతో అప్రమత్తమైన ఫామ్హౌస్ సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు వైద్యులు ఆయనకు సర్జరీ చేయనున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
- Advertisement -