- Advertisement -
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్లో గురువారం నుంచి తిరిగి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. హర్యానా ప్రభుత్వం ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆపరేషన్ షీల్డ్’ పేరిట పౌర రక్షణ విన్యాసాలు జరుపుతుంది. 22 జిల్లాలలో సాయంత్రం ఐదు గంటల నుండి ఈ విన్యాసాలు చేపడతారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
- Advertisement -