– పని గంటల పెంపుపై కర్నాటక ఐటీ ఉద్యోగుల ఆందోళన
బెంగళూరు: ఐటీ, ఐటిఇఎస్, బిపిఒ రంగాల్లో రోజువారీ పని గంటలకు 12 గంటలకు పెంచాలన్న కర్నాటక ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆ రాష్ట్ర ఐటీ/ ఐటిఇఎస్ ఉద్యోగుల సంఘం (కెఐటియు) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనలను నిరసిస్తూ గత ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించింది. కర్నాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టానికి సవరణలపై చర్చించేందుకు కార్మికశాఖ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సవరణ ద్వారా గరిష్ట పని గంటలను 10 గంటలకు, ఓవర్టైమ్తో 12 గంటలకు పెంచాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ ప్రతిపాదనలు ఆధునిక బానిసత్వమని, ఉద్యోగులంతా వీటికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆధునిక బానిసత్వం
- Advertisement -
- Advertisement -