– పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీతో దేశానికి ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతోందన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య వైశ్యామ్యాలు సృష్టిస్తోందన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతోందన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాళేేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కోరారు. రైతాంగానికి వెంటనే రైతు భరోసా జమ చేయాలన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న దేశవ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని చెప్పారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి తదితరులు ఉన్నారు.
ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేస్తున్న మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES