Saturday, May 10, 2025
Homeజాతీయంత్రివిధ దళాల అధిపతులతో మోడీ సమావేశం

త్రివిధ దళాల అధిపతులతో మోడీ సమావేశం

- Advertisement -

నవతెంగాణ -ఢిల్లీ: పాకిస్తాన్‌ తో ఉద్రిక్తతలు నేపథ్యంలో … మరోసారి శనివారం ప్రధాని నరేంద్ర మోడి హైలెవల్‌ డిఫెన్స్‌ మీటింగ్‌ (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ లతో) అయ్యారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌, ఎన్‌ఎస్‌ఏ దోవల్‌ హాజరయ్యారు. త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని చర్చ కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె. త్రిపాఠి పాల్గొన్నారు. సరిహద్దు లో నెలకొన్న తాజా పరిస్థితి, పాక్‌ విషయంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఆర్మీ, నేవీ, వాయుసేన టాప్‌ రిటైర్డ్‌ ఆఫీసర్లతోనూ మోడి భేటీ అయ్యారు. సైన్యంలో వారికి ఉన్న అపార అనుభవం ఆధారంగా తాజా పరిస్థితిని ఎదుర్కోవడంపై వారి సూచనలు, సలహాలను ప్రధాని తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -