- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకం చేయడాన్ని భారత ప్రధాని మోడీ స్వాగతించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదలవుతారని ఆకాంక్షించారు. గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం అందుతుందని.. శాశ్వత శాంతికి బాటలు పడతాయని తెలిపారు.
- Advertisement -