- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోడీ స్పందిస్తూ… రాష్ట్రపతి ముర్ము జీవితం, నాయకత్వం దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ బలాన్నిస్తుందని తెలిపారు.
- Advertisement -