నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఘనం..చేతలు శూన్యం అన్న చందంగా ఉందని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ అన్నారు. మోడీ దేశాన్ని ఉర్రూతలూగించే విధంగా నినాదాలివ్వడంలో ప్రావీణ్యం సంపాదించారు.. కానీ పరిష్కారాలకు కాదని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్లో పోస్టు చేశారు. నరేంద్ర మోడీ ఘనంగా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలిస్తారు. కానీ తయారీ రంగంలో భారత్ రికార్డులో స్థాయిలో పడిపోయింది. 2014 నుంచి తయారీ రంగం 14 శాతానికి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగమే తీవ్ర క్షీణతకు గురైతే.. మేక్ ఇన్ ఇండియా ఎలా సాధ్యం అని ఎక్స్ పోస్టులో మోడీని ఆయన ప్రశ్నించారు.
దేశ యువతలో నిరుద్యోగం పెరిగింది. భారత్ చైనా నుంచి దిగమతులు చేసుకోవడం రెండురెట్లు పెరిగిందని రాహుల్ ఎత్తిచూపారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే… ప్రధాని మోడీ మాత్రం నిజమైన పరిష్కారాల కంటే నినాదాలపైనే ఆయన ఎక్కువ దృష్టి సారిస్తున్నారని రాహుల్ ఎక్స్ పోస్టులో మండిపడ్డారు.
న్యూఢిల్లీలోని నెహ్రూ ప్లేస్లో శివం, సైఫ్ అనే ఇద్దరు ప్రతిభావంతులైన యువకుల్ని కలిశాను. వారితో మాట్లాడిన తర్వాత వారి కలల్ని నెరవేర్చుకోలేకపోతున్నారని నాకు అర్థమైంది. దీన్నిబట్టి చూస్తే.. భారత దేశ యువత ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటుందోనని స్పష్టమైందని రాహుల్ ఎక్స్ పోస్టులో హైలెట్ చేశారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది.. అభివృద్ధి చేస్తామని చెబుతూ సమావేశమవుతాము కానీ.. కానీ సొంతంగా తయారు చేసేందుకు నిరాకరిస్తున్నాము. దీంతో పొరుగు దేశమైన చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఆ దిగుమతుల వల్ల చైనా లాభ పడుతుంది అని రాహుల్ అన్నారు.
ప్రధానమంత్రి మోడీకి కొత్త ఆలోచనలు లేవు. భారతదేశ పరిశ్రమలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడం మానేశారు. ముఖ్యమైన పిఎల్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్) పథకాన్ని కూడా మోడీ నిలిపివేశారు. ఇప్పుడు భారతదేశానికి ప్రాథమిక మార్పు అవసరం. అదేమంటే.. నిజాయితీగల సంస్కరణలతో భారతీయ ఉత్పత్తిదారులకు ఆర్థికసహాయమందించాలి. మన దేశం ఇతర దేశాలకు మార్కెట్గా ఉండడం మానేయాలి. భారత్ సొంతంగా పరిశ్రమల్ని నిర్మించకపోతే అది ఎప్పుడూ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తూనే ఉంటుందని రాహుల్ హెచ్చరించారు. భారత్లో పరిశ్రమల్ని నిర్మించాలని, తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని రాహుల్ పోస్టులో పిలుపిచ్చారు.