నవతెలంగాణ హైదరాబాద్: మురుగప్ప గ్రూప్లో భాగమైన మాంట్రా ఎలక్ట్రిక్ (e-M&HCV బిజినెస్ వెర్టికల్), భారత ప్రభుత్వ ‘పిఎం ఈ-డ్రైవ్ పథకం’ (PM E-DRIVE Scheme) కింద సర్టిఫికేషన్ పొందిన దేశంలోని తొలి హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ తయారీదారుగా నిలిచి, భారతదేశ క్లీన్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయానికి గుర్తుగా, కంపెనీ దేశంలోని తొలి పిఎం ఈ-డ్రైవ్ సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ హెవీ ట్రక్ అయిన ‘రైనో 5538 ఈవీ 6×4 ట్రాక్టర్ ట్రైలర్’ను, భారతదేశపు అతిపెద్ద సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్ కంపెనీ అయిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్కు డెలివరీ చేసింది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని ముందుకు తీసుకెళ్ళడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంది.
మాంట్రా ఎలక్ట్రిక్ (టిఐ క్లీన్ మొబిలిటీ) చైర్మన్ అరుణ్ మురుగప్పన్, ఎండి జలజ్ గుప్తా, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ సత్యరాజ్ సమక్షంలో ఈ మైలురాయిని స్మరించుకున్నారు. భారతదేశ క్లీన్ మొబిలిటీ ఎకోసిస్టమ్కు ఈ విజయం ఎంత ప్రాముఖ్యమైనదో ఇది నొక్కి చెబుతుంది. ఈ చర్య భారతదేశ లాజిస్టిక్స్, మైనింగ్, నిర్మాణ, ఇతర భారీ పరిశ్రమల రంగాలలో ఎలక్ట్రిక్ హెవీ-డ్యూటీ ట్రక్కుల స్వీకరణను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. భారతదేశ డీకార్బనైజేషన్ (కర్బన ఉద్గారాల తగ్గింపు) లక్ష్యాలకు అనుగుణంగా, స్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాల వైపు ఇది ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుంది.
మొదటి పిఎం ఈ-డ్రైవ్ సర్టిఫైడ్ ‘రైనో 5538 ఈవీ’ని అరుణ్ మురుగప్పన్ జెండా ఊపి ప్రారంభించి, అల్ట్రాటెక్కు అందజేశారు. రూ. 10,900 కోట్ల పిఎం ఈ-డ్రైవ్ పథకంలో ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం ప్రత్యేకంగా రూ. 500 కోట్లు కేటాయించారు. దీనివల్ల రైనో 5538 ఈవీకి సంబంధించి ఒక్కో వాహనానికి రూ. 9.6 లక్షల వరకు వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రోత్సాహకం నిర్వహణ ఖర్చులను తగ్గించడం, ఇంధన ధరల అస్థిరత నుండి రక్షణ కల్పించడం, మారుతున్న సుస్థిరత, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి సహాయపడటం ద్వారా… దీర్ఘకాలికంగా ఫ్లీట్ ఆర్థిక లాభాలను మెరుగుపరుస్తుంది.
ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ, “భారీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారతీయ ఆవిష్కరణల పెరుగుతున్న సామర్థ్యానికి ‘పిఎం ఈ-డ్రైవ్’ పథకం ఒక నిదర్శనం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, మా లాజిస్టిక్స్ రంగాన్ని డీకార్బనైజ్ చేయడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా ‘నెట్ జీరో’ లక్ష్యాలను సాధించడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలకం. ఇటువంటి సర్టిఫికేషన్ల ద్వారా స్వయం-సమృద్ధ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా, మేము ‘ఆత్మనిర్భర్ వికసిత్ భారత్’ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాము.
ఈ మైలురాయి గురించి మాంట్రా ఎలక్ట్రిక్ (టిఐ క్లీన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్) చైర్మన్ అరుణ్ మురుగప్పన్ మాట్లాడుతూ, “భారతదేశ ఇంధన పరివర్తనలో సరుకు రవాణాను డీకార్బనైజ్ చేయడం అత్యంత క్లిష్టమైన సవాళ్ళలో ఒకటి. ముఖ్యంగా ఉద్గారాల తీవ్రత ఎక్కువగా ఉండే భారీ వాణిజ్య వాహనాల విభాగంలో ఈ మార్పును వేగవంతం చేయడానికి ఇది ఒక స్వాగతించదగిన, విప్లవాత్మక అడుగు. భారతదేశ మొబిలిటీ ఎకోసిస్టమ్లో అర్థవంతమైన, శాశ్వతమైన మార్పును తీసుకురాగల… సాంకేతికంగా అధునాతనమైన, నమ్మదగిన, స్కేలబుల్ ఎలక్ట్రిక్ M&HCV పరిష్కారాలను అందించడం ద్వారా ఈ జాతీయ మిషన్కు సహకరించడం మాంట్రా ఎలక్ట్రిక్లో మాకు గర్వంగా ఉంది,” అని పేర్కొన్నారు.



