Monday, June 30, 2025
E-PAPER
Homeసినిమాఅంతకుమించి వినోదం

అంతకుమించి వినోదం

- Advertisement -

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఆకట్టుకుని మంచి విజయం సాధించి, కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచింది. సినిమా రీ రిలిజ్‌ మరింత ఎగ్జైట్‌మెంట్‌ క్రిియేట్‌ చేసింది. సినిమాలో పాత్రలు, హ్యుమర్‌, లైఫ్‌కి కనెక్ట్‌ అయ్యే కథతో ఈ చిత్రం మ్యాసీవ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌ను అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ‘ఇఎన్‌ఇ రీపీట్‌ ‘టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా మళ్ళీ అదరగొట్టబోతోందనే హామీ ఇస్తోంది. దాదాపు ఒరిజినల్‌ స్టార్‌ కాస్ట్‌, టెక్నికల్‌ టీంతో తిరిగి వస్తున్న ఈ సీక్వెల్‌ నోస్టాల్జియా ఫీలింగ్‌ని కలిగిస్తుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఫస్ట్‌ పార్ట్‌లో అందరినీ అలరించిన గ్యాంగ్‌ విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమటం, వెంకటేష్‌ కాకుమాను మరోసారి మ్యాడ్‌నెస్‌ క్రియేట్‌ చేయబోతున్నారు. ఒరిజినల్‌ని క్రియేట్‌ చేసిన తరుణ్‌ భాస్కర్‌ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ ఒరిజినల్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ల పై డి.సురేష్‌ బాబు, సజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇది కేవలం కొనసాగింపు మాత్రమే కాదు, మ్యాడ్‌ నెస్‌ని మరింత పెంచుతుంది. ఎంటర్‌టైన్మెంట్‌, ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి స్థాయిలో జరుగుతోంది అని మేకర్స్‌ తెలిపారు. విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన – దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌, నిర్మాతలు: డి.సురేష్‌ బాబు, సజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి, సంగీతం: వివేక్‌ సాగర్‌, డీవోపీ: ఏఐ ఆరోన్‌, ఎడిటర్‌: రవితేజ గిరిజాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సౌమిత్రి ఎన్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీను ఈర్ల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -