విజయ్ ఆంటోని నటించిన కొత్త చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకుడు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మాణంలో, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీని జూన్ 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజరు ఆంటోని మేన ల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా పరిచయం చేస్తుండటం విశేషం.
ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేసిన సందర్భంగా హీరో విజరు ఆంటోని మాట్లాడుతూ, ‘లీడింగ్ డైరెక్టర్లంతా కూడా లియోని ఎడిటర్గా పెట్టుకుంటారు. అతను చాలా గొప్ప ఎడిటర్. ఈ కథను నాకు చెప్పినప్పుడు అతని స్టైల్ నాకు నచ్చింది. ఈ ట్రైలర్ కూడా అందరికీ నచ్చింది. రామాంజనేయులు నాకు చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా ‘నకిలీ’ని తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘మార్గన్’ను రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ‘భద్రకాళి’ కూడా రానుంది. నా మూవీ తెలుగులో రిలీజ్ అవుతోందంటే మొత్తం బాధ్యతను భాష్య శ్రీ చూసుకుంటారు. మా కాంబోలో ఇది 12వ చిత్రం. దీప్శిఖ రోల్ అందరినీ ఆకట్టు కుంటుంది. బ్రిగిడా గొప్ప నటి. ‘మార్గన్’ చాలా గొప్పగా వచ్చింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ ఇంటెన్స్ థ్రిల్లర్గా అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది. జూన్ 27న రాబోతోన్న ‘మార్గన్’ మూవీని అందరూ చూసి, ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ‘మార్గన్’
- Advertisement -
- Advertisement -