Monday, June 16, 2025
E-PAPER
Homeసినిమా'మార్గన్‌' రిలీజ్‌కి రెడీ

‘మార్గన్‌’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంటెడ్‌ అయిన విజయ్‌ ఆంటోని ఎప్పుడూ ఆడియెన్స్‌ను కొత్త పాయింట్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఆయన నటిస్తూ, నిర్మించిన నూతన చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌ పాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్‌ ఆంటోని ఫిలింస్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తుండగా, సర్వాంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బానర్‌పై జె.రామాంజనేయులు సమర్పిస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ-క్రైమ్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీని ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజరు ఆంటోని మేనల్లుడు అజరు ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన టీజర్‌, ట్రైలర్‌ అన్నీ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. మళ్లీ విజరు ఆంటోని ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, కొత్త పాయింట్‌ను టచ్‌ చేశారని ట్రైలర్‌ చూస్తేనే అర్థం అవుతోంది. ఇక ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్ని అందించడంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ‘మార్గన్‌’ మీదున్న నమ్మకంతో సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్‌ సురేష్‌ ఎంటర్టైన్మెంట్‌ భారీ ఎత్తున రిలీజ్‌ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు హీరో, నిర్మాత విజరు ఆంటోని సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేష్‌ బాబు కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్‌, ప్రితిక, బ్రిగిడా, వినోద్‌ సాగర్‌, అజరు ధీషన్‌, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు: లియో జాన్‌ పాల్‌, ప్రెజెంట్స్‌: జె.రామాంజనేయులు, సంగీతం: విజరు ఆంటోని, సినిమాటోగ్రఫీ: యువ ఎస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజా ఎ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -