నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని చిన్న ఏడిగి గ్రామానికి చెందిన రూపకు (19) మద్నూర్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన గణేశ్ అని వ్యక్తితో వివాహమైంది. ఒకటిన్నర సంవత్సరాల పాప పేరు పున్నమి కూడా ఉంది. అయితే రెండు నెలల క్రితం అత్తగారింట్లో గొడవల కారణంగా తల్లిగారిల్లు అయిన చిన్న ఏడిగికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ నెల 9న మధ్యాహ్నం సమయంలో జుక్కల్ మార్కెట్కు వెళ్లి వస్తానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లడం జరిగింది. సాయంకాలమైనా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో బంధువుల ఇండ్లలో ఎంత వెతికానా.. ఎక్కడా కనిపించలేదు. దీంతో తండ్రి శోభన్ వార్ బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.
జుక్కల్ లో తల్లీకూతురు అదృశ్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES