- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: బాచుపల్లిలో దారుణం జరిగింది. ఏనిమిదేండ్ల, మూడేళ్ల చిన్నారులిద్దరిని సంపులో పడేసి.. తల్లి లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారులిద్దరూ చనిపోగా తల్లి ప్రాణాలతో బయటపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లలు మృతి చెందినట్లు గుర్తించారు. లక్ష్మిని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కాగా ఈ దారుణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -