– సాంకేతికత, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలకు అవకాశం : ఉప కులపతి ప్రొ.టి.కిషన్కుమార్రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-కేపీహెచ్బీ
జేఎన్టీయూహెచ్ తన అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ జర్మన్ విశ్వవిద్యాలయాలు నాలెడ్జ్ ఫౌండేషన్-రాయుట్లింగన్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ కాసెల్తో ఒక ప్రతిష్టాత్మక ఒప్పందంపై గురువారం సంతకం చేసింది. ఈ మేరకు జేఎన్టీయూహెచ్లో జరిగిన కార్యక్రమం లో యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ. టి.కిషన్ కుమార్రెడ్డి మాట్లాడారు. జర్మన్ విశ్వ విద్యాలయాలతో తమ భాగస్వామ్యం విద్యా రంగంలో సాంకేతికత, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలను కలిపే గొప్ప అవకాశమన్నారు. ఇది విద్యార్థులకు గ్లోబల్ కెరీర్ అవకాశాలను పెంచుతుందని తెలిపారు. ఈ ప్రోగ్రాం కేవలం విద్యకే కాకుండా సాంస్కృతిక పరస్పర మార్పిడి, పరిశోధనలో సహకారం వంటి అనేక రంగాల్లో అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. డ్యూయల్ డిగ్రీ-జేఎన్టీయూహెచ్, జర్మన్ విశ్వవిద్యాలయం నుంచి రెండు డిగ్రీలు, అంతర్జాతీయ అనుభవం-భారతదేశం, జర్మనీలో విద్య అనుభవం, రెండు విశ్వవిద్యాలయాల ఆధునిక సదుపాయాలు, వివిధ సంస్కృతుల అనుభూతి ద్వారా వ్యక్తిత్వాభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా అంత ర్జాతీయ స్థాయిలో బ్యాచిలర్-మాస్టర్, సమ్మిళిత డిగ్రీ ప్రోగ్రాములు ప్రారంభించనున్నట్టు ప్రక టించారు. భారతదేశంలో విద్యను కొనసాగిస్తూ, జర్మనీలో ఉన్న భాగస్వామ్య విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యమన్నారు. ఇంటిగ్రే టెడ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ (5.5 ఏండ్ల ప్రోగ్రామ్), సిద్ధాంతాన్ని అనుసంధానంగా ప్రాక్టికల్ పరి జ్ఞానంతో పాటు వ్యక్తిగత దృష్టితో విద్యార్థులకు సలహాలు, ప్లేస్ మెంట్ సేవలు తదితర అంశా లను వివరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీ యూహెచ్ రిజిస్ట్రార్, తెలంగాణ-భారత్ కేఎఫ్ రెట్లింగెన్ విశ్వ విద్యాలయం జర్మని సీఈఓ డేనియల్ గీగిస్, యూనివర్సిటీ ఆఫ్ కాసెల్ జర్మనీ డాక్టర్ ఎస్సీ డిర్క్ డల్హాస్, జర్మన్ విశ్వవిద్యాల యాల అధికారులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
జేఎన్టీయూహెచ్-జర్మన్ విశ్వవిద్యాలయాల మధ్య ఎంఓయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES