‘బబుల్ గమ్’ తరువాత హీరో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ఈ చిత్రానికి ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేశారు.ఈ క్లైమాక్స్ సీక్వెన్స్లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ని చేశారు. ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్గా ఉండబోతున్నాయి. మారేడుమిల్లిలో మూడో షెడ్యూల్ పూర్తి చేశారు. ఇంకొక్క షెడ్యూల్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ నెలలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.