– పైప్ లైన్ లీ కేజీని అరికట్టారు
నవతెలంగాణ – జుక్కల్ : ‘జుక్కల్ జెడ్పిహెచ్ఎస్ ఆవరణలో బురధమయం` అనే వెబ్ వార్త ఆదివారం నాడు ప్రచురించడం జరిగింది. ఈ వార్త పైన జుక్కల్ ఎంపీడీవో కార్యాలయ ఏపీవో (MPO) రాము ఆధ్వర్యంలో జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయ అధికారులకు వెంటనే పైప్ లైన్ లీకేజీ పనులను మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. సోమవారం నాడు పాఠశాల ఆవరణలో లీకేజీ అవుతున్న పైపులను యంత్రాల సాయంతో తవ్వకాలు నిర్వహించి నూతన పైపులైను ఏర్పాటు చేసి నీటి లీకేజీని అరికట్టారు. రోడ్డుపైన నిలిచిన నీటిని తొలగించి శుభ్రం చేయించారు. జుక్కల్ కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ విద్యార్థిని, విద్యార్థులు రోడ్డుపైన నీరు నిల్వకుండా బురదను తొలగించినందుకు ఎంపీ ఓ , జిపి అధికారులను అభినందనలు తెలిపారు.
నవతెలంగాణ వెబ్ వార్తకు స్పందించిన ఎంపీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES