- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తొలుత భూవరాహ స్వామిని దర్శించుకున్న ఆయన, అనంతరం శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిలి వద్ద టీటీడీ బోర్డు ఎక్స్అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు.
- Advertisement -



