- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో మహిళా న్యాయవాది స్వప్న హత్య ఘటన తనను కలచివేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్త సంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితిగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేయాలనుకున్న ఓ యువతి ఇలాంటి దారుణానికి బలవడం అత్యంత బాధాకరమని మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- Advertisement -



