Saturday, May 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ ప్రభుత్వానికి మస్క్‌ గుడ్‌బై

ట్రంప్‌ ప్రభుత్వానికి మస్క్‌ గుడ్‌బై

- Advertisement -

– పన్ను బిల్లును వ్యతిరేకించిన మరునాడే రాజీనామా
– మంత్రులు, అధికారులతో తరచూ ఘర్షణలు
– పాలనలో తగ్గిన ప్రాధాన్యత…హామీలు నెరవేర్చడంలో వైఫల్యం
– డోజ్‌ కొనసాగుతుంది : ఎలన్‌ మస్క్‌
వాషింగ్టన్‌:
ట్రంప్‌ ప్రభుత్వం నుంచి వైదొలగాలని టెస్లా సీఈఓ, వ్యాపారవేత్త ఎలన్‌ మస్క్‌ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు, పరిపాలనా సామర్ధ్యాన్ని పెంచేందుకు మస్క్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే అవన్నీ విఫలమవడంతో చివరికి ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు. మస్క్‌ నిర్ణయాన్ని శ్వేతసౌధం బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ధృవీకరించింది. ప్రభుత్వ సమర్ధతా విభాగంలో మస్క్‌ను ఓ ప్రత్యేక ఉద్యోగిగా ట్రంప్‌ నియమించుకున్నారు. అయితే ఆ పదవీకాలం ముగియడంతో సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ట్రంప్‌కు మస్క్‌ కృతజ్ఞతలు తెలిపారు.
పన్ను బిల్లును వ్యతిరేకించిన మరునాడే…
తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు ట్రంప్‌తో మస్క్‌ ఎలాంటి అధికారిక చర్చ జరపలేదు. అయితే ఆయన నిష్క్రమణపై ‘సీనియర్‌ సిబ్బంది స్థాయి’లో నిర్ణయం జరిగిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు రాయి టర్స్‌ వార్తా సంస్థకు తెలిపాయి. మస్క్‌ రాజీనామాకు దారితీసిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ ట్రంప్‌ ప్రతిపాదించిన మార్క్యూ పన్ను బిల్లును వ్యతిరేకి ంచిన మరునాడే ఆయన తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఇది చాలా ఖరీదైన బిల్లు అని, అమెరికా డోగ్‌ సర్వీసులో తన పనిని దెబ్బతీస్తుందని మస్క్‌ విమర్శించారు.
ప్రాధాన్యత కోల్పోవడంతో…
మస్క్‌ వ్యాఖ్యలపై డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ సహా శ్వేతసౌధంలోని కొందరు సీనియర్‌ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మస్క్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్‌ ప్యాకేజీకి మద్దతు కూడగట్టడానికి అధ్యక్ష భవనం రిపబ్లికన్‌ సెనెటర్లను పిలవాల్సి వచ్చిందని వారు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌కు మస్క్‌ అత్యంత సన్నిహితుడే అయినప్పటికీ ఆయన ప్రాధాన్యతను క్రమేపీ తగ్గించడంతో విధిలేని పరిస్థితులలో బయటకు వచ్చారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత బిలియనీర్‌ అయిన మస్క్‌ ఆయన బృందంలో ఓ శక్తివంతమైన వ్యక్తిగా నిలిచారు. అయితే ఆయన చర్యలు అతిగా కన్పించేవి. పొరబాటు చేసినా క్షమాపణలు చెప్పే వారు కాదు. సంప్రదాయ నిబంధనలకు కట్టుబడే వారు కాదు.
మంత్రులు, అధికారులతో విభేదాలు
ప్రభుత్వ వ్యయాన్ని డోగ్‌ కనీసం రెండు ట్రిలియన్‌ డాలర్లు తగ్గిస్తుందని మస్క్‌ బీరాలు పలికారు. ఇప్పటి వరకూ 175 బిలియన్‌ డాలర్లు ఆదా చేశానని డోగ్‌ చెప్పుకుంది.ప్రభుత్వ ఉద్యోగులపై మస్క్‌ ఎన్నడూ తన ద్వేషాన్ని దాచుకోలే దు. టెలీవర్క్‌కు సంబంధించి కోవిడ్‌ కాలం నాటి హక్కును రద్దు చేయడం ద్వారా ఉద్యోగుల స్వచ్ఛంద తొలగింపులు పెరుగుతాయని, దానిని తాము స్వాగతిస్తామ ని తెలిపారు. ప్రారంభంలో మస్క్‌ వ్యూహాలను కొందరు క్యాబినెట్‌ మంత్రులు స్వాగతించారు. ఉద్యోగాల కోతను సమర్ధించారు. అయితే సిబ్బందిపై నిర్ణయం తీసుకునేది డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీలే కానీ మస్క్‌ కాదని మార్చి ప్రారంభంలో ట్రంప్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌ క్యాబినెట్‌లోని ముగ్గురు సీనియర్‌ మంత్రులు.. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రవాణా మంత్రి సీయాన్‌ డఫీ, ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌…తో మస్క్‌ ఘర్షణ పడేవారు. ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారోను ‘మూర్ఖుడు’గా అభివర్ణించారు. దీనిపై నవారో ఎంతో కలత చెందారు. అదే సమయంలో ప్రభుత్వంలో తనకు గడువు దగ్గర పడిందని సూచించడం మొద లు పెట్టారు. అనుకున్న విధంగా ఖర్చులను తగ్గించలేకపో యానని అంగీకరించా రు. వ్యాపారాలపై మరింత దృష్టి సారించడానికి ప్రభుత్వ పనిని తగ్గించుకుంటానని గత నెల 22న జరిగిన టెస్లా కాన్ఫరెన్స్‌ కాల్‌లో సంకేతాలు ఇచ్చారు.
డోజ్‌ కొనసాగుతుంది
తాను ఊహించిన దాని కంటే ఫెడరల్‌ బ్యూరోక్రసీ దారుణంగా ఉన్నదని ఈ వారం ప్రారంభంలో ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికతో మస్క్‌ అన్నారు. సమస్యలు ఉంటాయని అనుకున్నానని, కానీ పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రయత్నించ డం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పారు. ట్రంప్‌ ప్రభుత్వంలో ప్రత్యేక ఉద్యోగిగా మస్క్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. మస్క్‌ వైదొలిగి నప్పటికీ డోగ్‌ తన పని కొనసాగిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ట్రంప్‌, డోజ్‌ కలిసి ప్రభుత్వంలోని 12 శాతం మంది ఉద్యోగులను (2.6 లక్షలు) తొలగించగలిగాయి. ముందస్తు పదవీ విరమణ ఆఫర్లు, బెదిరింపులతో ప్రభుత్వం ఉద్యోగులను తొలగి స్తోంది. అదే సమయంలో డోజ్‌ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని తొలగి ం చేందుకు డోజ్‌ ప్రయత్నాలు చేస్త్తుండగానే న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయి.
బిల్లును చెత్తకుప్పలో వేయండి
ఏదేమైనా మస్క్‌ నిర్ణయం ప్రభుత్వంపై ఆయన అసహనాన్ని చాటిచెబుతోంది. ముఖ్యంగా భారీ వ్యయంతో కూడిన రిపబ్లికన్ల పన్ను-బడ్జెట్‌ బిల్లుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లు బడ్జెట్‌ లోటును తగ్గించకపోగా పెంచుతుందని, డోగ్‌ బృందం పనితీరును దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు. బిల్లును చెత్తకుప్పలో వేయాలంటూ టీవీలో మస్క్‌ చేసిన వ్యాఖ్య శ్వేతసౌధం సహాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మస్క్‌ రాజకీయ కార్యకలాపాలపై చాలా కాలంగా విమర్శలు వినవస్తున్నాయి. ట్రంప్‌ సలహాదారు పనిని వదిలేసి, టెస్లా కార్యకలాపాలపై మరింత దృష్టి సారించాలని కొందరు ఇన్వెస్టర్లు ఆయనకు సలహా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -