Thursday, June 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు24గంటలూ అందుబాటులో ఉండాలి

24గంటలూ అందుబాటులో ఉండాలి

- Advertisement -

– మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలకు సీఎం ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

వానాకాలం రాబోతున్న తరుణంలో ‘మాన్‌ సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌’ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌లో వాటర్‌ హార్వెస్టింగ్‌ వెల్స్‌ పనుల్లో పురోగతిపై ఆయన ఆరా తీశారు. హార్వెస్టింగ్‌ వెల్స్‌లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్‌ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వానాకాలం సన్నద్ధతపై సీఎం సమీక్షించారు. వాతావరణ శాఖ సూచనలకనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మానిటరింగ్‌ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌, ఇతర సమ స్యలు తలెత్తకుండా పోలీస్‌, ట్రాఫిక్‌, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభా గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ నాలుగు విభా గాల అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలు తలెత్త కుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. డీసిల్టింగ్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు శేషాద్రి, మాణిక్‌ రాజ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, హెచ్‌ఎండీఏ అధికారులతో పాటు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -