- Advertisement -
సర్పంచ్ శ్యామల శేఖర్
నవతెలంగాణ – కట్టంగూర్
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సిబ్బంది ఎస్సీ, ఎస్టీ చట్టాలపై, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు.సమావేశంలో వార్డు సభ్యులు మైనం ఉమా అంబేద్కర్, జూనియర్ సహాయకులు భాగ్యలక్ష్మి, జిపిఓ అల్లావుద్దీన్, రేషన్ డీలర్ శివ కుమార్ ఉన్నారు.
- Advertisement -



