కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఒర్రె వనమ్మ-రాజైలు
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో అన్నివిధాలా నాచారం గ్రామాభివృద్దే తమ సంకల్పమని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఒర్రె వనమ్మ-రాజైలు అన్నారు. ప్రచారంలో భాగంగా ఏ వార్డుకు వెళ్లిన ప్రజలు అవశేషంగా ఆదరిస్తున్నారని తెలిపారు. గ్రామాన్ని ఇప్పటికే మంత్రి దుద్దిళ్ల సైలెట్ గ్రామంగా ప్రకటించిన విషయం గమనించి ప్రజలు తమ అమూల్యమైన ఓటు తమ ఉంగరం గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిసిన వెంటనే గ్రామంలో అర్హులైన వారికి ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లతోపాటు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలతోపాటు, గ్రామ సమస్యలు పరిష్కారం, ఇచ్చిన హామీలు అమలైయ్యేనా చేస్తామన్నారు.
నాచారం అభివృద్దే నా సంకల్పం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



