Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాచారం యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

నాచారం యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలంలోని నాచారం గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఆదివారం నియామకం చేసినట్లుగా యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి తెలిపారు. గ్రామ యూత్ అధ్యక్షుడుగా కోట శ్యాంసుందర్, ఉపాధ్యక్షుడుగా దుండ్ర అనిల్, ప్రధాన కార్యదర్శిగా బండ రఘు, కార్యదర్శిగా బోయిని వెంకటేష్ , కోశాధికారిగా ఇసనపు అనిల్, అధికారప్రతినిదిగా కన్నూరి వెంకటేష్, ప్రచార కమిటీ కన్వీనర్ గా బానోతు మహేందర్ తోపాటు పదిమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఐస్నపు రవి,కాంగ్రెస్ పరాయి మండల ప్రధాన కార్యదర్శి మావురపు వెంకన్న, యూత్ డివిజన్ నాయకుడు మండల రాహుల్,మాజీ వార్డు సభ్యులు తుటి దేవేందర్, గాజు శ్రీనివాస్ యాదవ్,కార్యకర్తలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -