- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దయోత్తున్న వరద నీరు పలు జలాశయాలకు పొటెత్తుంది. తాజాగా
మరోసారి నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రెండో దఫా ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం.. పూర్తిస్థాయి 590 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం.. పూర్తిస్థాయి 312.04 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ జలాశయం ఇన్ఫ్లో 65,827 క్యూసెక్కులుగా, ఔట్ఫ్లో 60,644 క్యూసెక్కులుగా నమోదైంది.
- Advertisement -