- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా కూడా మంటలు అదుపులోకి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. బిల్డింగ్ సెల్లార్ లో వాచ్ మెన్ యాదయ్య పిల్లలు, మరో కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు సెల్లార్ లోనే చిక్కుకుపోయారు. ఈ ఘటన కారణంగా నాంపల్లి స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్లే సందర్శకులకు కీలక సూచన చేశారు పోలీసులు. ఇవాళ నుమాయిష్ వెళ్లడం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
- Advertisement -



