– స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య
నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రజా సమస్యలను వెలికి తీయడంలో నవతెలంగాణ ముందు వరుసలో ఉంటుంది అని సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య తెలిపారు. విజయవంతంగా 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ పత్రిక యజమాన్యానికి, విలేకరులకు, సిబ్బందికి, ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం ఉంటూనే ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా వెలికితీస్తోంది. వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా పత్రికల్లో ప్రచురించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంలో ముందు వరుసలో నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. రాబోయే రోజుల్లో పత్రిక మరింత రాటుదేలి ఎల్లవేళలా ప్రజాపక్షం ఉంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ప్రజా సమస్యలను వెలికితీయడంలో నవతెలంగాణ దిట్ట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES