- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ డిప్యూటీ సీఎం, విద్యుత్శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్లోని డిప్యూటీ సీఎం నివాసంలో ఆయన్ని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నవీన్మిట్టల్ను అభినందించారు. సమర్థవంతమైన సేవల్ని అందించాలని ఆకాంక్షించారు. దీనికి ప్రతిస్పందనగా శక్తివంచన లేకుండా విద్యుత్రంగ అభివృద్ధికి కృషి చేస్తానని నవీన్మిట్టల్ హామీ ఇచ్చారు.
- Advertisement -