- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దిగ్గజ తమిళ దర్శకుడు మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో యువ హీరో నవీన్ పొలిశెట్టితో తన తర్వాత ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం విశ్వనటుడు కమల్ హాసన్తో కలిసి ‘థగ్ లైఫ్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు ముగిసిన వెంటనే నవీన్ పొలిశెట్టితో తన తర్వాతి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
- Advertisement -