– ఎల్అండ్టీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక బూటకమని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర సాగదీసి ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనం అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్కు పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏడాదిన్నరలో రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండబెట్టి, 500 మందికిపైగా అన్నదాతల ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లడం మాని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్కు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES