- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ (యూజీ) పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను అభ్యర్థుల ఈ-మెయిల్ ఐడీలకు పంపినట్లు ఎన్టీఏ(NTA) అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యర్థులు జూన్ 3నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు లేవనెత్తవచ్చని సూచించారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 (నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల ప్యానల్ సమీక్షించనుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 20.8 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ రాశారు.
- Advertisement -