- Advertisement -
– ఎమ్మెల్యే ఆదేశించినా తీరని సమస్య
– ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా
– గ్రామ యువకుడు ఆశన్న
నవతెలంగాణ నవాబు పేట : విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అని తీగలపల్లి గ్రామ యువకుడు ఆశన్న విద్యుత్ అధికారులపై మండిపడుతున్నాడు. ఎమ్మెల్యే లేఖ రాసి అధికారులకు పంపిన సమస్యను పరిష్కరించడం లేదని అంటున్నాడు. విద్యుత్ శాఖ డీఈ ఏఈ లను కలిసి సమస్యలను పరిష్కరించాలని ఎన్నో సార్లు అడిగినా నిధులు లేవని చెప్పారు అని అంటున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -