- Advertisement -
– సెబీ డీఆర్హెచ్పీ సమర్పణ
హైదరాబాద్ : ప్రముఖ డయాలసిస్ సేవల సంస్థ నెఫ్రోఫ్లస్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఇందుకోసం సెబీకి ప్రతిపాదితర పత్రాలు (డీఆర్హెచ్పీ) సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.353.4 కోట్ల నిధులు సమీకరించనుంది. ఇందుకోసం 1.27 కోట్ల ఈక్విటీ షేర్లను ఒఎఫ్ఎస్ కింద విక్రయించనుంది. 2009లో స్థాపించిన నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ భారత్లో 21 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 447 క్లినిక్లు, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్, సౌదీ అరేబియాలో కార్యకలాపాలను కలిగి ఉంది.
- Advertisement -