Wednesday, June 4, 2025
E-PAPER
Homeజిల్లాలువనదేవతలను దర్శించుకున్న నూతన ఈఓ

వనదేవతలను దర్శించుకున్న నూతన ఈఓ

- Advertisement -

మర్యాదపూర్వకంగా కలిసిన పూజారులు 
నవతెలంగాణ – తాడ్వాయి 
: మేడారం జాతరకు ఎండోమెంట్ ఈవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మేకల వీరస్వామి సోమవారం వనదేవతలను దర్శించుకున్నారు. పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు చందా రఘుపతిరావు, సిద్ధబోయిన అరుణ్, కళ్యాణ్ లు మర్యాదపూర్వకంగా కలిసి సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతల కు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం వారికి శాలువాలు కప్పి సన్మానించి అమ్మవారి ప్రసాదం అందించారు. మేడారంలో నిర్వహించే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతరకు సంబంధించిన విషయాలపై చర్చించారు. వారి వెంట సిద్దబోయిన రమేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -