Sunday, May 18, 2025
Homeజాతీయంత్వరలో కొత్త రూ.20 కరెన్సీ నోట్లు

త్వరలో కొత్త రూ.20 కరెన్సీ నోట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్‌ కింద త్వరలో కొత్త రూ.20 డినామినేషన్‌ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా సంతకం ఉంటుంది. రాబోయే రూ.20 నోట్ల డిజైన్‌, ఫీచర్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌ కింద ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. కలర్‌ స్కీమ్‌, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం.. అన్నీ అలాగే ఉంటాయి. ”రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో గవర్నర్‌ సంజరు మల్హోత్రా సంతకంతో రూ.20 డినామినేషన్‌ నోట్లను విడుదల చేస్తుంది. ఈ నోట్ల డిజైన్‌ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ .20 నోట్లను పోలి ఉంటుంది” అని సెంట్రల్‌ బ్యాంక్‌ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా గతంలో జారీ చేసిన అన్ని రూ.20 నోట్లు జారీ చేసే గవర్నర్‌ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్‌ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్‌బిఐ అధినాయకత్వం మార్పు తరువాత సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -