Friday, June 13, 2025
E-PAPER
Homeసినిమాముస్సోరీలో నయా షెడ్యూల్‌ షురూ..

ముస్సోరీలో నయా షెడ్యూల్‌ షురూ..

- Advertisement -

చిరంజీవి, నయనతార జంటగా దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ పై ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఇప్పటికే ముగించింది టీమ్‌. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి పాల్గొన్నారు. రషెస్‌ అద్భుతంగా ఉన్నాయి.
1990, 2000లలో చిరంజీవి గోల్డెన్‌ ఎరాలో కనిపించిన వింటేజ్‌ మెగాస్టార్‌ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నారు. ఇది అభిమా నులకు ఒక విజువల్‌ ట్రీట్‌ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఈ చిత్రానికి సంబంధించి రెండవ షెడ్యూల్‌ బుధవారం ముస్సోరీలోని బ్యూటీఫుల్‌ హిల్‌ స్టేషన్‌లో ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్‌తోపాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్‌’ తర్వాత చిరుతో కలిసి నయనతార నటిస్తున్న మూడవ చిత్రమిది.
చిరంజీవి ఒక స్కూల్‌ గ్రౌండ్‌లో టేబుల్‌ మీద కూర్చోని వుండగా, పిల్లలు తనవైపు పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆయన థంబ్స్‌ అప్‌ ఇస్తూ ప్రజెంట్‌ చేసిన ఒక వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ విజువల్‌ చాలా ప్లజెంట్‌గా ఉంది. భీమ్స్‌ సిసిరోలియో అద్భుతమైన సంగీతం మరింత జారుని యాడ్‌ చేసింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి తన ట్రేడ్‌మార్క్‌, క్రియేట్‌ ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలను పెంచారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – అనిల్‌ రావిపూడి, నిర్మాతలు – సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, సమర్పణ – అర్చన, సంగీతం – భీమ్స్‌ సిసిరోలియో, డీవోపీ – సమీర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌ – తమ్మిరాజు, రచయితలు – ఎస్‌ కష్ణ, జి.ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – ఎస్‌.కష్ణ, లైన్‌ ప్రొడ్యూసర్‌ – నవీన్‌ గారపాటి, అడిషినల్‌ డైలాగ్స్‌ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -