Monday, June 30, 2025
E-PAPER
Homeసినిమారాజమండ్రిలో నయా షెడ్యూల్‌ షురూ

రాజమండ్రిలో నయా షెడ్యూల్‌ షురూ

- Advertisement -

రామ్‌ పోతినేని హీరోగా మహేష్‌ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్‌ ఆదివారం రాజమండ్రిలో ప్రారంభమైంది. రామ్‌, ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్‌ డై హార్డ్‌ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్‌ స్టార్‌ పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే రామ్‌ సరసన కథానాయికగా నటిస్తోంది. ట్యాలెంటెడ్‌ స్టార్‌ కాస్ట్‌, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో ఈ సినిమా ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది అని మేకర్స్‌ తెలిపారు. రావు రమేష్‌, మురళి శర్మ, సత్య, రాహుల్‌ రామకష్ణ, వీటీవీ గణేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: మహేష్‌ బాబు పి., నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, సిఇఓ : చెర్రీ, సంగీతం: వివేక్‌ – మెర్విన్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ :హరీష్‌ తుమ్మల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -