‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత హీరో తేజ సజ్జా ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగాఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ముంబయిలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ సజ్జాతో పాటు కొన్ని ప్రధాన పాత్రల నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. సినిమాకు సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి, ఆగస్టులో రిలీజ్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2డి, 3డి ఫార్మాట్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇందులో మనోజ్ మంచు విలన్గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు.