- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో కొత్త జూపార్క్ ఏర్పాటుకు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. తెలంగాణ గ్లోబల్ సమిట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో వంతారా గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. వన్య ప్రాణాలకు సేవ అనే నినాదంతో వంతారా పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ నెలాఖరున గుజరాత్లోని వంతారాను సందర్శించనున్నట్లు తెలిపారు.
- Advertisement -



