Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక యువకుడు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఈ దురదృష్టకర సంఘటనకు సంబంధించి మీడియాలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపుల కారణంగానే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించింది. ఈ నోటీసులకు రెండు వారాల్లోగా స్పందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. యువకుడి మృతికి దారితీసిన పరిస్థితులు, పోలీసులపై వచ్చిన ఆరోపణలపైన లోతైన విచారణ జరిపి, వాస్తవాలను నివేదించాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -