2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుని సొంతం చేసుకుంది. అలాగే చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన ఈ సక్సెస్ఫుల్ బ్యానర్లో ఇప్పుడు రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సోలో హీరోగా ఆయన నటిస్తున్న తొలి సినిమా ఇదే. గతంలో నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్గా నయన్ సారిక నటిస్తుంది. ‘ఆరు, క’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 ‘హలో వరల్డ్’, సోనీ లివ్ ‘బెంచ్ లైఫ్’ వంటి వెబ్ సిరీస్లతో తెలుగుకి పరిచయం అయ్యారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథ అందించగా, మహేష్ ఉప్పల కో రైటర్గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.