- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టును ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా గురువారం ప్రాజెక్టుని పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎస్ ఈ రాజశేఖర్, ఈ ఈ సులేమాన్, క్వాలిటీ కంట్రోల్ ఈ ఈ భూమా రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డి ఈ ఈ దత్తాత్రేయ, ఏఈ శివకుమార్, సాకేత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 5.474 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

- Advertisement -