Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిమ్స్ కిడ్నీ వైద్యులకు సన్మానం..

నిమ్స్ కిడ్నీ వైద్యులకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నిమ్స్ లో డయాలసిస్ చేసుకుంటున్నటువంటి 900 మంది కిడ్నీ రోగులు రూ. 2016 నెలవారీ పెన్షన్లు పొందడంలో కీలక పాత్ర పోషించిన నిమ్స్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్ శ్రీ భూషణ్ రాజు (నెఫ్రాలజీ విభాగాధిపతి), ప్రొఫెసర్ గంగాధర్ మరియు ప్రొఫెసర్ స్వర్ణలత మరియు మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్య గౌడ్ గారిని నిమ్స్ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు శాలువా తో సత్కరించి ధన్యవాదాలు తెలియచేసారు.

ఈ పెన్షన్ల మంజూరు కోసం ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి కిడ్నీ రోగులకు బస్ పాస్‌లు మరియు పెన్షన్ల ఏర్పాటుకు మరియు కొనసాగుతున్న చికిత్సకు సంబంధించిన ఆర్థిక సహకారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన నిమ్స్ డైరెక్టర్ ప్రో. ఎన్. బీరప్ప గారికి, ప్రో. శ్రీ భూషణ్, ప్రో. గంగాధర్, ప్రో. స్వర్ణలత మరియు ఆరోగ్యశ్రీ సి ఈ ఓ కు నిమ్స్ కిడ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు.నిమ్స్ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ డి ప్రభాకర్, యస్ కె అల్తాఫ్, పాషమియా జాయింట్ సెక్రటరీ, కె ఎస్ రావు కోశాధికారి మరియు అసోసియేషన్ సభ్యులు పార్వతీ, రఘు, గ్రేస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -