- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నీరవ్ మోడీకి లండన్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో తనను భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నీరవ్ మోడీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను అక్కడి కోర్టు కొట్టివేసింది. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.వేల కోట్లు తీసుకొని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- Advertisement -



